Homeగాసిప్స్టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అంటోంది?

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అంటోంది?

టాలీవుడ్ ఎంట్రీకి  రెడీ అంటోంది?
టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అంటోంది?

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి గారాల ప‌ట్టి జాన్వీ క‌పూర్ ని శ్రీ‌దేవి త‌ర‌హాలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని బ‌డా నిర్మాత అశ్వ‌నీద‌త్ నుంచి పూరి జ‌గ‌న్నాథ్ వ‌ర‌కు చాలా మంది బిగ్ ప్రొడ్యూస‌ర్స్, డైరెక్ట‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. అశ్వ‌నీద‌త్ `జ‌గ‌దేక వీరుడు అతిలోకి సుంద‌రి` చిత్రానికి సీక్వెల్ చేస్తాన‌ని, దాని ద్వారా జాన్వీ క‌పూర్‌ని టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని ప్లాన్ చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

ఆ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ తో జాన్వీని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. ఆమె కోస‌మే టీమ్ అంతా బాంబేకు షిఫ్ట్ అయ్యింది. అక్క‌డే కీల‌క స‌న్నివేశాల షూటింగ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. క‌ర‌ణ్ జోహార్‌తో మంత‌నాలు జ‌రిపించారు. అయినా డేట్స్ స‌మ‌స్య త‌లెత్త‌డంతో పూరి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో అన‌న్య పాండేని హీరోయిన్‌గా తీసుకున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే జాన్వీ క‌పూర్ తెలుగు సినిమాలు వ‌దులుకుని హిందీలో చేసిన సినిమాల‌న్నీ థియేట‌ర్‌లో రిలీజ్ అవుతాయ‌నుకుంటే క‌రోనా కార‌ణంగా ఓటీటీల్లో రిలీజ్ కావ‌డం జాన్వీకి న‌చ్చ‌డం లేద‌ట‌. అన‌వ‌స‌రంగా తెలుగు సినిమాలు వ‌దులుకుని హిందీ చిత్రాలు చేశాన‌ని, ఇప్పుడ‌వి ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయ‌ని ఫీల‌వుతోంద‌ట‌. త్వ‌ర‌లోనే దీపిక త‌ర‌హాలో ఓ భారీ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All