Homeటాప్ స్టోరీస్పునర్జన్మల నేపథ్యంలో ఎన్టీఆర్ చరణ్ ల సినిమా

పునర్జన్మల నేపథ్యంలో ఎన్టీఆర్ చరణ్ ల సినిమా

intresting buzz on ntr -charan multistarrerఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్ర కథ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి . పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలన్నీ దాదాపుగా ఘనవిజయాలు సాధించినవే కావడంతో ఈ గుసగుసలు మరింత ఎక్కువయ్యాయి . ఇక రాజమౌళి గత చిత్రాలు మగధీర , ఈగ చిత్రాలు కూడా పునర్జన్మ ల నేపథ్యంలో రూపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .

బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ పలువురు అగ్ర హీరోలు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రాలు వండర్స్ క్రియేట్ చేసాయి . ఇక సల్మాన్ ఖాన్ – షారుఖ్ ఖాన్ లు కలిసి నటించిన ”కరణ్ -అర్జున్ ” చిత్రం కూడా పునర్జన్మ నేపథ్యంలో రూపొందిందే ! ఇంతకుముందు వేరే బ్యాక్ డ్రాప్ అని కథనాలు వచ్చాయి కాగా ఇప్పుడేమో పునర్జన్మ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి -ఎన్టీఆర్ -చరణ్ లు ముగ్గురు ఉద్దండులు కలిసి చేస్తున్న చిత్రం కాబట్టి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం . ఎన్టీఆర్ – చరణ్ అభిమానులు పూనకం వచ్చి ఊగేలా సినిమా చేయనున్నాడట రాజమౌళి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All