Homeటాప్ స్టోరీస్పాక్ ని చిత్తుచిత్తుగా ఓడించిన ఇండియా

పాక్ ని చిత్తుచిత్తుగా ఓడించిన ఇండియా

దాయాది పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసింది టీమ్ ఇండియా . ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ పై ఎప్పుడూ భారత్ దే పైచేయి అని మరోసారి చాటి చెప్పారు . ఇప్పటివరకు ప్రపంచ కప్ పోటీలలో పాకిస్థాన్ తో భారత్ ఏడుసార్లు వరుసగా విజయాలు నమోదు చేయగా 27 సంవత్సరాలుగా ఇదే పంథా పునరావృతం అవుతూనే ఉంది . నిన్న మాంచెస్టర్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 89 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది భారత్ .

- Advertisement -

భారత్ – పాక్ మ్యాచ్ కు వరుణుడు కాస్త ఇబ్బంది పెట్టినా ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను చూసి కాబోలు వరుణ దేవుడు సెలవు తీసుకున్నాడు దాంతో పాకిస్థాన్ – భారత్ మ్యాచ్ కి అడ్డంకి లేకుండా పోయింది . ఇక రోహిత్ శర్మ సెంచరీ బాదడంతో ఈ భారీ విజయం సాధించింది . రోహిత్ కు తోడు కెప్టెన్ కోహ్లీ , మరో ఓపెనర్ రాహుల్ రాణించడం విశేషం . ఇక బౌలర్లు బుమ్రా , భువీ , కుల్దీప్ , హార్దిక్ పాండ్య , విజయ్ శంకర్ లు రాణించడంతో భారత్ పని సులువయ్యింది . మొత్తానికి పాకిస్థాన్ పై ఎప్పటికి భారత్ దే పైచేయి అని మరోసారి ఈ మ్యాచ్ ద్వారా నిరూపించి కోట్లాది భారతీయుల మనసులను గెలిచారు టీమ్ ఇండియా . తిరుగులేని , మరిచిపోని విజయాన్ని అందించారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All