గత ఏడాది చివర్లో ప్రతీరోజు పండగే`లో ఏంజిల్ ఆర్నాగా తనదైన శైలి నటనతో నవ్వించింది రాశీఖన్నా. ఆ తరువాత చేసిన `వెంకీమామ`తో ఫరవాలేదనిపించుకుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో యామినిగా నటించింది. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తరువాత ప్రస్తుతం తమిళంలో బిజీగా వుంది రాశిఖన్నా.
తెలుగులో అవకాశాలు లేకపోవడంతో వరుస ఫొటో షూట్లతో అదరగొట్టేస్తోంది. టాలీవుడ్లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో తన మనసులో మటని బయటపెట్టేసింది. ప్రస్తుతానికి తాను సింగిల్ గానే వున్నానని, తన జీవింలో ఎవరూ లేరని చెప్పుకొచ్చింది. ఒక వేళ అలాంటి వ్యక్తి తన లైఫ్లోకి వస్తే అతనితో డేటింగ్కి వెళ్తా అని చెబుతోంది.
లాక్డౌన్ సమయంలో చాలా మంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రానా పెళ్లి ఫొటో చూసి షాకయ్యానని తెలిపింది. ఆ క్షణం ఇప్పటికీ మదిలో మెదులుతూనే వుందంది. నితిన్, కాజల్ తమ సోల్మేట్లని వివాహం చేసుకున్నారు. నా జీవితంలోనూ అలాంటి అందమైన రోజు వస్తుందని భావిస్తున్నానని చెబుతోంది రాశిఖన్నా. ప్రస్తుతానికైతే వర్కవుట్లు.. నిద్రపోవడం వంటివి చేస్తున్నానని సెలవిచ్చింది.