అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన `అల వైకుంఠపురములో`మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇందులో విభిన్నమైన పాత్రలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తరువాత ఆయన తన పంథాను మార్చుకున్నట్టు తెలుస్తోంది. సెలెక్టీవ్గా మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`.
ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ని శుక్రవారం హీరో ప్రభాస్ విడుదల చేశారు. యదార్థ సంఘటనలకు ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. `నా జీవితంలో అమ్మకి.. అమ్మాయికి… అభికి.. అభినాబావ సంబంధం వుంది` అంటూ సుశాంత్ చెబుతున్న డైలాగ్తో టీజర్ మొదలైంది. వెంటనే వెన్నెల కిషోర్ ఎవరా `అభి` బావ నాకు చెప్పలేదు అనడం నవ్వులు పూయిస్తోంది. చెయ్యి దాటి పోతోందిరా ఏదో ఒకటి చెయ్యాలి వంటి సుశాంత్ డైలాగ్లు సినిమా వినోదాత్మకంగా సాగుతూనే సీరియస్ గా వుండబోతోందని అర్థమవుతోంది.
తనకు నచ్చిన బైక్ వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? .. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటీ? .. తన గర్ల్ ఫ్రెండ్మనసు ఎలా గెలుచుకున్నాడు అన్నదే ఇందులో ఆసక్తికరం. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. AI స్టూడియోస్ మరియు శాస్త్రా మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
#IVNRteaser is here!!
Hope U like it!??
Thank you so much for launching it #Prabhas anna! ?❤️https://t.co/KUkQU5lyUi@AIStudiosOffl @ShaastraMovies @iamHarishCK @darshn2012 @Meenachau6 @mynnasukumar @Plakkaraju @vennelakishore @priyadarshi_i @UrsVamsiShekar @Ticket_Factory— Sushanth A (@iamSushanthA) January 29, 2021