తమిళ సూపర్స్టార్ రజనీకాంత్కి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర సమాచార్, సహయక మంత్రి ప్రకాష్ జవడేకర్ ఈ గురువారం ఉదయం రజనీకి ఈ అవార్డుని అందిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రజనీకి ప్రముఖుల నుంచి అభినందన వర్షం కురుస్తోంది.
ఈ నేపథ్యంలో తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా రజనీ స్పందించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విశేషంగా చెప్పుకునే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనని వరించడం రజనీ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రయాణంలో తోడుగా సాగిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
`సినిమా రంగంలో అత్యంత విలువైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రకాష్ జవడేకర్, ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్, నా స్నేహితుడు రాజ్ బహదూర్. పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్, అలాగే ఈ రజనీకాంత్ను సృష్టించిన నా గురువు బాలచందర్తో పాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రీబ్యూటర్స్, థియేటర్ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాపస్తంగా వున్న అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, ప్రతిపక్ష పార్టీ నేత స్థాలిన్, కమల్హాసన్తో పాటు ఇతర రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్` అని పేర్కొన్నారు.
???????? pic.twitter.com/WwOHRNhLwF
— Rajinikanth (@rajinikanth) April 1, 2021