వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ విషయంలో హైడ్రామా కొనసాగుతోంది . నిన్నంతా ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? లేదా ?అన్న టెన్షన్ నెలకొనగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రిలీజ్ కాకుండా స్టే ఆర్డర్ ఇచ్చింది ఏపీ హైకోర్టు . అయితే తెలంగాణలో కూడా రిలీజ్ అవుతుందా ? ఆగిపోతుందా ? అన్న విషయంలో తర్జన భర్జన మొదలయ్యింది అయితే ఎట్టకేలకు తెలంగాణలో మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతోంది .
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ తో పాటుగా పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతున్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి . అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . ఈరోజు మధ్యాహ్నం కు ఏపీ హైకోర్టు కూడా తుది ఉత్తర్వులు జారీ చేయనుందట దాంతో అక్కడ కూడా లక్షీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా ? లేదా ? తెలిసిపోనుంది .
English Title : Hydrama on Lakshmi’s ntr