Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు

పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు

hyderabad city court summons to pawan kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది , ఈనెల 24న కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది . దాంతో పరువు నష్టం కేసులో పవన్ కళ్యాణ్ ఈనెల 24న సిటీ సివిల్ కోర్టు కు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది . వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన నేపథ్యంలో ఆ తతంగమంతా మళ్ళీ మళ్ళీ టెలికాస్ట్ చేసారు పలు చానళ్ళు అయితే అందులో ఎక్కువ భాగం పంచుకుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దాంతో ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కి ఈ విషయం అంతా సంతోషాన్ని ఇచ్చిందని కామెంట్ చేసాడు .

ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై అకారణంగా కామెంట్ చేయడమే కాకుండా ఆంధ్రజ్యోతి సంస్థల పరువుకు భంగం కలిగించారని పవన్ కళ్యాణ్ పై పది కోట్లకు పరువునష్టం దావా వేశారు . ఆ కేసు లో భాగంగా ఈనెల 24న కోర్టు లో హాజరు కావాల్సిందిగా జడ్జి ఆదేశించారు . కోర్టు ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే . ఇక అక్కడ ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి . పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కి ఇచ్చిన మద్దతు ని ఉపసంహరించుకొని జనసేన ని బలోపేతం చేయాలనే దృష్టితో పర్యటన చేస్తున్నాడు . ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకా స్థానిక నాయకత్వ సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All