Homeటాప్ స్టోరీస్సైరా నైజాం హక్కుల కోసం విపరీతమైన పోటీ

సైరా నైజాం హక్కుల కోసం విపరీతమైన పోటీ

Sye Raa Narasimha Reddy
సైరా నైజాం హక్కుల కోసం విపరీతమైన పోటీ

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రస్తుతం రిలీజ్ కి ముస్తాబవుతోంది. అంతకంటే ముందు రేపు భారీ లెవెల్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్ని నిర్వహిస్తారు. మరోవైపు అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా హక్కుల్ని చేజిక్కించుకోవడానికి భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా ట్రైలర్ విడుదలయ్య బయ్యర్లలో చిత్రంపై నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా నైజాంలో హక్కుల కోసం పెద్ద పార్టీల మధ్యే పోటీ నడుస్తుండడం విశేషం.

డిస్ట్రిబ్యూటర్లు ఒక్క నైజాం ఏరియాకే 35 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుండగా, నిర్మాతలు 40 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు, రేపట్లో ఈ డీల్ సెట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఏరియాల్లో కూడా ఈ చిత్ర హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All