ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చరణ్ లు భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే . ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా చరణ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు . ఇక ఈ సినిమా కు బడ్జెట్ ఎంతో తెలుసా …… 300 కోట్లు . అక్షరాలా మూడు వందల కోట్లు బడ్జెట్ అట ! ఈ విషయాన్నీ నిర్మాత డివివి దానయ్య స్వయంగా ప్రకటించాడు .
ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఇక చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు . ఆ రెండు చిత్రాలను దసరా నాటికీ పూర్తి చేసి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు ఎన్టీఆర్ , చరణ్ లు . నందమూరి , మెగా కుటుంబాల హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి .