ఇండియాలో భారీగా విడుదలవుతున్న క్రిస్ హెమ్స్వార్త్ మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్..
క్రిస్ హెమ్స్వార్త్, తెస్సా థాంప్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్ జూన్ 14న ఇండియాలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ అమెరికన్ యాక్షన్ అడ్వంచర్ ను ఎఫ్ గ్యారీ గ్రే తెరకెక్కించారు. ఇండియాలో తన సినిమా షూటింగ్ జరుపుకోవడం ఆనందంగా ఉందని.. తన అనుభవాన్ని పంచుకున్నారు హీరో క్రిస్ హెమ్స్వార్త్. హైదరాబాదీ బిర్యానీకి ఫ్యాన్ అయిపోయారు హీరో క్రిస్ హెమ్స్వార్త్. తమ దేశానికి వెళ్లిన తర్వాత కూడా రోజూ ఈ బిర్యానిని ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపారు. రోజూ సెట్స్ కు వేల సంఖ్యలో వచ్చే అభిమానులు కూడా తమకు ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని తెలిపారు క్రిస్ హెమ్స్వార్త్. తమను తాము రాక్ స్టార్స్ లా ఫీల్ అయ్యేలా అభిమానులు చేసారని చెప్పారాయన. మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్ హిందీ, తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల అవుతుంది. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.