సెలబ్రిటీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడుతూనే వున్నారు. చాలా వరకు సేఫ్గా బయటపడుతున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారిన పడింది. ముంబైలో తన తల్లిదండ్రులతో కలిసి వుంటున్న తమన్నా ఇటీవల తన పేరెంట్స్కి కరోనా సోకిందని వెల్లడించిన విషయం తెలిసిందే. వారు త్వరగానే కోలుకున్నారని చెప్పిన తమన్నా ఇటీవల తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది.
షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న వేళ సడన్గా తమన్నా అస్వస్థతకు గురైంది. స్వల్పంగా దగ్గు, జ్వరం రావడంతో అనుమానించిన తమన్నా వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారట. ఆమెని పరీక్షించిన డాక్టర్లు కరోనా సోకినట్టు నిర్ణారించడంతో ఆ విషయాన్ని మీడియాతో పంచుకుంది. తాజాగా సోమవారం ఆమె కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు తెలిసింది.
అయితే కరోనా సిప్టమ్స్ తగ్గినా 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లోనే వుండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలిసింది. డాక్లర్ల సూచనల మేరకు తమన్నా 14 రోజుల పాటు ఐసోలేషన్కే పరిమితం కానుందట. ఆ తరువాతే షూటింగ్లలో పాల్గొన నుందని తెలిసింది.
View this post on Instagram