ఇటీవలే విడుదలైన టచ్ చేసి చూడు ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది . రిలీజ్ అయిన మొదటి ఆట నుండే టచ్ చేసి చూడు చిత్రానికి పూర్తిగా డిజాస్టర్ టాక్ వచ్చింది , రవితేజ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు . రాజా ది గ్రేట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తుందని ఆశించాడు కానీ ఫలితం తిరగబడింది . అయితే ఈ సినిమాలో మొదట హీరోగా నటించాల్సింది ఎవరో తెలుసా …….. టచ్ చేసి చూడు కథ విన్నది ఎవరో తెలుసా ……… సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో నటించాల్సి ఉంది అలాగే కథ విన్నది వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు .
మొదట ఈ కథ విన్నప్పుడే అంతగా సంతృప్తి గా లేడట సురేష్ బాబు దాంతో కొద్దిరోజులు ఆగు చూద్దాం అని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడట అయితే ఈలోపే వెంకటేష్ కు కూడా కథ చెప్పడానికి రెడీ అయ్యాడట ! కానీ సురేష్ బాబు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే కదా ! వెంకటేష్ వినేది దాంతో భారీ ప్లాప్ నుండి తృటిలో తప్పుకున్నాడు వెంకటేష్ . ఒకవేళ సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే వెంకటేష్ ప్లాప్ మూటగట్టుకొని ఉండేవాడు .