హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఏపీ రాజకీయాలపై తాజాగా సంచలన ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏపీలోని స్వర్ణా ప్యాలెస్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పది మంది కరోనా పేషెంట్లు మృతి చెందిన విషయం తెలిసిందే. రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా తాజా ఉదంతం జరిగిందని అధికార పక్షం విమర్శలు కురిపిస్తోంది.
ఏపీలో ఈ ఉదంతం రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తోంది. దీనిపై రామ్ తాజాగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. `ఏపీ ముఖ్యమంత్రిని చెడుగా చూపించే కుట్ర జరుగుతోందని నా అనుమానం. ఆయన కింద ఉన్న కొంత మంది వ్యక్తులే తనకు తెలియకుండా తాజా సంఘటనలు చేస్తున్నందున దీనిని పరిశీలించమని నేను జగన్ గారిని అభ్యర్థిస్తున్నాను. ఇది ఆయన ప్రతిష్టకు మరియు నిజాయితీ విధానానికి భారీ నష్టం కలిగిస్తుంది` అని రామ్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు #APisWatching అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నట్టు రామ్ నటించిన తాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మించారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ రీఓపెన్ అయిన తరువాత రిలీజ్ చేయాలని చిత్ర బృంద ప్లాన్ చేస్తోంది.