కరోనా దెబ్బతో జన జీవితం స్థంభించిపోయింది. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఏ రంగం చూసినా నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. సినీ రంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. థియేటర్లు మూసివేయడంతో సినీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. రిలీజ్కు సిద్ధంగా చాలా సినిమాలున్నాయి. ఇందులో కొన్ని ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటే మరి కొన్నింటిని థియేటర్లు ఏపెన్ అయ్యాకే రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.
అలా నిర్ణయించుకున్న క్రేజీ చిత్రాలకు ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. అయినా మేకర్స్ టెమ్ట్ కావడం లేదు. అందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న చిత్రం `రెడ్` కూడా వుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల రూపొందించారు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధంగా వున్న ఈ చిత్రానికి ఓటీటీ కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్టున్నాయి. అయినా మేకర్స్, హీరో రామ్ అందుకు అంగీకరించడం లేదు. ఆ మధ్య 25 కోట్ల ఆఫర్ ఇచ్చిన ఓ ఓటీటీ సంస్థ తాజాగా 30 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిందట. ఆఫర్ టెమ్టింగ్గా వున్నా రామ్ ఓటీటీ సంస్థ ఇచ్చిన ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఓటీటీలో ఎట్టిపరిస్థితుల్లో `రెడ్` చిత్రాన్ని రిలీజ్ చేయమని, థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా హీరో రామ్ అన్నట్టు తెలిసింది.