“ఊరందరికీ శకునం చెప్పే బల్లి చివరికి కుడితి గుంటలో పడి దెబ్బ తగిలించుకుటుంది” అని అప్పట్లో మా తాత గారు చెప్పారు. ఎందుకో, ఇప్పుడు తెలుగు మాట్లాడడం రాని తెలుగు సినిమా హీరో రాజశేఖర్ విషయంలో ఈ సామెత కనెక్ట్ అవుతోంది.
ప్రస్తుతం మేటర్ లోకి వస్తే, మంగళవారం అర్ధరాత్రి స్థానిక శంషాబాద్ పరిధిలో పెద్ద గోల్కొండ శివార్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన కారు ప్రమాదంలో, హీరో రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. సంబంధిత ఘటనలో కార్ లో ఉన్న ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో రాజశేఖర్ కు తీవ్ర ప్రమాదం తప్పినట్లు అయింది. వాహనం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే హీరో రాజశేఖర్ మరొక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంగళవారం రాత్రి రామోజీ ఫిలిం సిటీ నుండి హైదరాబాద్ కు తన బెంజ్ కార్ TS 07 FZ 1234 లో రాజశేఖర్ స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరగా, అర్ధరాత్రి ఒంటిగంట 15 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం రాజశేఖర్ అతివేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ రావడమే కారణమని తెలుస్తోంది.
ప్రధమ చికిత్స చేయించుకొని ప్రెస్ మీట్ లో తాను బాగానే ఉన్నానని అందరికీ ధన్యవాదాలు అని జీవిత తో పాటు కలిసి చెప్పిన రాజశేఖర్, పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వైద్య పరీక్షలకు హాజరయ్యారా.? లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఓవర్ స్పీడ్ కు సంబంధించి రాజశేఖర్ వాహనంపై ఇప్పటికే 23 ట్రాఫిక్ చలానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం ఆయన తల్లి చనిపోయిన నేపథ్యంలో, ఆయన డిప్రెషన్ లో ఉంటున్నారని, అందుకే గతంలో కూడా ఒకసారి ఆయన కారు ప్రమాదానికి గురయ్యారని, ఆయన సన్నిహిత వర్గాలు సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి అంత మానసిక ఇబ్బందిలో ఉన్నప్పుడు , కనీసం ఒక డ్రైవర్ ని కూడా పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఎందుకు ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు.? అన్న విషయంపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు.