వరల్డ్ కంటికి కనిపించని వైరస్ కారణంగా వణికిపోతోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నిర్లక్ష్యం కారణంగా ఇటలీ అల్లాడుతోంది. వందల సంక్షలో ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న దేశాల్లోని జనాలంతా ఈ వైరస్ ధాటికి భయంతో వణికిపోతూ బయటికి రావడానికి జంకుతున్నారు.
ఈ నేపథ్యంలో దేశాధినేతలు తమ ప్రజల రక్షణ కోసం కఠిన నిర్ణయాల్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా మన దేశంలో ఈ నెల 22న జనతా కర్ఫ్యూ ని ప్రకటించారు ప్రధాని. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దీన్ని పాటించాలని సూచించారు. అయితే ఈ కర్ఫ్యూను ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
ఇదిలా వుంటే ప్రతికూల పరిస్థితులున్నా `జాన్` సినిమా కోసం జార్జియా వెళ్లి షూటింగ్ చేసి వచ్చిన హీరో ప్రభాస్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్నది ప్రధాన చర్చగా మారింది. జార్జియా నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చిన ప్రభాస్ కరోనా స్క్రీనింగ్ తరువాత ఇంటికే పరిమితం అయినట్టు తెలిసింది. తనకు తాను క్లిన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజుల పాటు ప్రజలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారట.