పవర్స్టార్ పవన్కల్యాణ్ కొంత విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకొచ్చిన చిత్రం `వకీల్సాబ్`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటిస్తున్నారు.
ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని ఇంకా ప్రమోషన్స్ ప్రారంభించలేదని, ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్ చాలా పూర్గా వున్నాయని పవర్స్టార్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా వుంటే నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కొత్త ప్లాన్ వేశారని తెలిసింది.
హీలియం బెలూన్స్తో `వకీల్సాబ్` ప్రమోషన్స్ని ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే ససాగర్ సొసైటీలోని తన కార్యాలయంలో ఒక హీలియం బెలూన్ని ఏర్పాటు చేశారని, త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ హీలియం బెలూన్స్ని ఏర్పాటు చేసి `వకీల్ సాబ్` ప్రమోషన్స్ని మోతెక్కించబోతున్నారట.