పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అమితంగా ఆనందించారు. అసలు పవన్ రీ ఎంట్రీకి ఈ సినిమా ఉంటే పెర్ఫెక్ట్ గా ఉంటుందని భావించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పంచుకున్నారు. ఇది పక్కా కమర్షియల్ కథతో తెరకెక్కనున్న సినిమాగా చెబుతున్నారు. అయితే ఈ సినిమా లాంచ్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న పింక్ సినిమా పూర్తయ్యాకే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముంది. అయితే ఇంకా సమయం ఉన్నా కానీ ఈ సినిమాపై రూమర్లు అయితే బానే వస్తున్నాయి.
తాజాగా ఒక వెబ్ సైట్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం కూడా రీమేక్ అని రాసింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ కు రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెల్సిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరోసారి సేఫ్ రూట్ కోసం రీమేక్ ను ఎంచుకుంటున్నారని ఆ వెబ్ సైట్ రాసింది. వేదాళం రీమేక్ కానీ తేరి సినిమా రీమేక్ కానీ అవ్వొచ్చని ఆ వెబ్ సైట్ రాసేసింది.
ఇప్పటికే తేరి పోలీసోడుగా తెలుగులోకి డబ్ అయ్యి టీవీల్లో కూడా చాలా సార్లు ప్రసారమైందని రాసింది. అయితే ఈ విషయంపై హరీష్ శంకర్ స్పందించాడు. గాల్లో వార్తలు రాయొద్దని ఆ వెబ్ సైట్ కు చురకలు అంటించారు. దయచేసి అభిమానులను తప్పు ద్రోవ పట్టించకండి. ఏదైనా వార్త రాసేముందు కనుక్కుని రాయండి అని స్పందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రారంభమై వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలవుతుందని తెలుస్తోంది.