Homeటాప్ స్టోరీస్హరిహర వీరమల్లు క్రేజీ అప్డేట్ ఇచ్చిన రైటర్ బుర్రా సాయిమాధవ్

హరిహర వీరమల్లు క్రేజీ అప్డేట్ ఇచ్చిన రైటర్ బుర్రా సాయిమాధవ్

harihara veeramallu new update
harihara veeramallu new update

వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 60 శాతం వరకు పూర్తికాగా.. ఏప్రిల్ 06 నుండి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది. పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్ జరిగాయి. ఈ తరుణంలో సినిమా తాలూకా క్రేజ్ అప్డేట్ ను రైటర్ బుర్రా సాయిమాధవ్ సోషల్ మీడియా లో పంచుకున్నారు.

17వ శతాబ్దం నాటి మొఘలుల నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు తన సినీ కెరీర్ లో పోషించని పాత్రను పోషిస్తున్నారని, భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారని సాయిమాధవ్ బుర్రా తెలిపారు. డైరెక్టర్ క్రిష్ పవన్ కల్యాణ్ చాలా కొత్తగా, చక్కగా ప్రజెంట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అప్డేట్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All