చారిత్రాత్మక నేపథ్యంలో `రుద్రమదేవి` వంటి భారీ చిత్రాన్ని అందించారు గుణశేఖర్. ఈ మూవీ తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూవీ విడుదలై నేటితో ఐదేళ్ల పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ షాకింగ్ అప్డేట్తో వచ్చారు. ఈ మూవీ తరువాత మైథలాజికల్ కథాంశం నేపథ్యంలో రానా కీలక పాత్రలో `హిరణ్యకశ్యప` చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించారు.
ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్మ అమెరికాలో జరుగుతోందని ప్రకటించారు కూడా. ఇదే విషయాన్ని డి. సురేష్బాబు కూడా వెల్లడించారు. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో `హిరణ్యకశ్యప` ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే శుక్రవారం సోషల్ మీడియా వేదికగా దర్శకుడు గుణశేఖర్ వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.
`ఈ గ్లోబల్ మహమ్మారి మధ్య `హిరణ్యకశ్యప` ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురారావలి కబట్టి దీని కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో నేను మరొక చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన అప్డేట్ని ఈ రోజు రాత్రి 7:11 నిమిషాలకు ప్రకటించబోతున్నానంటూ వెల్లడించారు గుణశేఖర్. ఇంతకీ ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు?.. ఏ మాకథ అన్నది తెలియాటంలే ఈ రోజు రాత్రి 7:11 గంల వరకు వేచి చూడాల్సిందే.