`రుద్రమదేవి` వంటి ఛారిత్రక చిత్రం తరువాత భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ వరల్డ్ క్లాస్ టెక్నీషిన్స్తో ఓ భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. `హిరణ్య కశ్యప` పేరుతో తెరపైకి రాబోతున్న ఈ చిత్రం కోసం అమెరికాలో గత మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మైథలాజికల్ మూవీగా అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది.
హాలీవుడ్ చిత్రాల తరహాలో పూర్తి స్థాయి ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తియిన తరువాతే ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నామని గత కొంత కాలంగా నిర్మాత డి. సురేష్ బాబు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 180 కోట్ల భారీ వ్యవయంతో ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
లాస్ ఏంజిల్స్ స్టూడియోస్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని చిత్ర బృందం వెల్లడించే అవకాశం వుందని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. వరల్డ్ బెస్ట్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారట. ఆ వివరాల్ని త్వరలోనే మేకర్స్ వెల్లడించే అవకాశం వుందని, సినిమాని కూడా ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారో కూడా ఓ స్పష్టత వస్తుందని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.