టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన థియేటర్ లపై జీఎస్టీ అధికారులు వేసిన జరిమానాని చెల్లించాడు దాంతో శభాష్ మహేష్ అని కితాబునిస్తున్నారు అధికారులు . హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతం గచ్చిబౌలిలో మహేష్ బాబు ఏషియన్ వాళ్లతో కలిసి మల్టీప్లెక్స్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే . ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ ( ఏ ఎం బి ) పేరుతో ఈ థియేటర్ లు రన్ అవుతున్నాయి .
అయితే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినప్పటికీ మహేష్ బాబు థియేటర్ లలో మాత్రం జీఎస్టీ తగ్గించకుండా సినిమాకు వస్తున్న వాళ్ళ మీద పన్నులు బాదుతూనే ఉన్నారు , ఈ విషయం జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీ చేయగా అది నిజమే అని తేలింది దాంతో 35లక్షల 66 వేల రూపాయలను వినియోగదారులనుండి వసూల్ చేసారని తెలుసుకొని నోటీసులు ఇచ్చారు . దానికి స్పందించిన మహేష్ బాబు 35లక్షల 66 వేలని అధికారులకు చెల్లించాడు . దాంతో శభాష్….. మహేష్ అని అంటున్నారు . అయితే ఈ సొమ్ము అంతా జనాలది . సినిమా చూసిన ప్రేక్షకులది .
English Title: GST Commissionerate appreciate Mahesh babu