Homeటాప్ స్టోరీస్14 ఏళ్ల త‌రువాత సీక్వెల్!

14 ఏళ్ల త‌రువాత సీక్వెల్!

14 ఏళ్ల త‌రువాత సీక్వెల్!
14 ఏళ్ల త‌రువాత సీక్వెల్!

కొన్నేళ్ల క్రితం చేసిన హిట్ చిత్రాల‌కు సీక్వెల్స్ చేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులో కొన్ని స‌క్సెస్ అవుతున్నాయి. కొన్ని అడ్ర‌స్ లేకుండా పోతున్నాయి.   క‌మ‌ల్‌హాస‌న్‌, గౌత‌మ్ మీన‌న్‌ల తొలి క‌ల‌యిక‌లో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వెట్టైయాడు విలైయాడు`. 2006లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో `రాఘ‌వ‌న్‌` పేరుతో రిలీజ్ చేశారు. రెండు భాష‌ల్లోనూ అనూహ్య విజ‌యాన్ని సాధించింది. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది.

కాప్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి దాదాపు 14 ఏళ్ల త‌రువాత‌ సీక్వెల్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సైకిక్ థ్రిల్ల‌ర్‌గా రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో రూపొందించిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌ళ్లీ అదే త‌ర‌హా క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సీక్వెల్‌ని చేయాల‌నుకుంటున్న‌ట్టు తెలిసింది. వేల్ ఫిల్మ్స్‌కి రెండు చిత్రాలు చేయ‌బోతున్నారు. అందులో ఒక‌టి సూర్య హీరోగా వుంటుంద‌ట‌.

- Advertisement -

రెండ‌వది `రాఘ‌వ‌న్‌` సీక్వెల్ అని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇందులొ క‌మ‌ల్ న‌టిస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ `ఇండియ‌న్‌2` సీక్వెల్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All