టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హగ్డే హవా ఆ రేంజ్ లో నడుస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ సీనియర్ హీరోయిన్స్ అవకాశాలకు గండి కొడుతున్న ఈ బ్యూటీ దాదాపు స్టార్ హీరోలందరిని కవర్ చేసేస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ – మహేష్ – జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించిన పూజ మరోవైపు అఖిల్ లాంటి కుర్ర హీరోలతో కూడా నటిస్తోంది.
ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ లో కూడా నటించనున్నట్లు టాక్ వస్తోంది. దీంతో అమ్మడి లక్కు ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైపు రష్మీక మందన్న లాంటి హీరోయిన్ పోటీ ఇస్తున్నప్పటికి పూజా రేంజ్ తగ్గడం లేదు. ఇక పవన్ ప్రాజెక్ట్ దాదాపు సెట్టయినట్లే అని రోజుకో వార్త ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తోంది. బోణి కపూర్ – దిల్ రాజు సంయుక్తంగా పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ కి రంగం సిద్ధం చేశారు. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా ఫిక్స్ అయినట్లు తెలిసింది.
ఇకపోతే ఆ సినిమా ప్రాజెక్ట్ అఫీషియల్ ఏనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది. ఇటీవల బోణికపూర్ తో పూజా హెగ్డే కనిపించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ పై కూడా అమెతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తేవాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ రెడీ అంటే షెడ్యూల్స్ ని రెడీ చేసుకోవాలని చూస్తున్నారు. మరి షూటింగ్ కి పవన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.
- Advertisement -