Homeటాప్ స్టోరీస్పండగ చేసుకోనున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో

పండగ చేసుకోనున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో

పండగ చేసుకోనున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో
పండగ చేసుకోనున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి మరో రెండు సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకుల దృష్టి ఈ రెండు చిత్రాలపైనే ఉంది. దాదాపు 250 కోట్లు ఈ చిత్రంపైనే బిజినెస్ జరిగిన నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి దీనిపైనే ఉండనుంది. సంక్రాంతికి సినిమాల ప్రభావం ఎక్కువున్నా సరే ఈ రెండు సినిమాలకు ఓపెనింగ్స్ కీలకం కానున్నాయి. అందుకే మొదటి వారంలో ఎక్కువ థియేటర్లు ఈ రెండు చిత్రాలకే కేటాయించనున్నారు.

ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్న విషయం తెల్సిందే. నిన్న సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అలాగే ఈరోజు అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ జరగనుంది. అల వైకుంఠపురములో చిత్రంలో పాడిన సింగర్స్ ఇందులో లైవ్ పెర్ఫర్మ్ చేయనున్నారు. అలాగే చిత్ర థియేట్రికల్ ట్రైలర్ కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

ఇక ఈ రెండు చిత్రాల విడుదలలకు ముందు మేజర్ బూస్టప్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు జారీ చేయడంతో చిత్ర బృందాలు రెండూ ఊరట పొందాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టిప్లెక్స్ ల రేట్లు 250 దాకా పెంచుకోవచ్చు. అలాగే సింగిల్ స్క్రీన్లు 200 దాకా పెంచుకోవచ్చు. ఇక తెలంగాణలో సింగిల్ స్క్రీన్లు 150 దాకా పెంచుకోవచ్చు. మల్టిప్లెక్స్ లు 200 దాకా పెంచుకోవచ్చు. పెరిగిన రేట్లతో ఈ రెండు చిత్రాలకు చాలా ఉపయోగం కానుంది. అలాగే రోజుకి ఐదు షో లు వేసుకునే అనుమతి కోసం కూడా ఈ రెండు చిత్రాలు ఉపయోగపడ్డాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All