పెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయం అందుకున్న తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రంగా ” ఈ నగరానికి ఏమైంది ” చేసాడు . ఇక ఈ సినిమా ఈనెల 29న విడుదల అవుతోంది , ఈ చిత్రాన్ని నిర్మించింది అగ్ర నిర్మాత సురేష్ బాబు కాగా మరో రెండు చిత్రాలను కూడా తన బ్యానర్ లోనే తరుణ్ భాస్కర్ తో చేయడానికి ఒప్పందం చేసుకున్నాడట ! పెళ్లి చూపులు చిత్రాన్ని అసోసియేట్ అయి రిలీజ్ చేసింది సురేష్ బాబు అన్న విషయం అందరికీ తెలిసిందే .
ఆ సినిమా సాధించిన విజయంతో తన బ్యానర్ లో ఛాన్స్ ఇచ్చాడు సురేష్ బాబు . దాంతో ఈ నగరానికి ఏమైంది చిత్రం చేసారు అయితే ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా తనకే చేయాలనీ ఒప్పందం చేసుకున్నాడట సురేష్ బాబు . డబ్బులు కూడా దండిగా ఇస్తుండటంతో తరుణ్ భాస్కర్ కూడా గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని ఒప్పేసుకున్నాడట . ఈ నగరానికి ఏమైంది చిత్రం విడుదల అయ్యాక మరో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు .