భారతీయ జనతా పార్టీ పాలిట రాష్ట్రమైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు . ఏడాది కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు . గోవా ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు ముఖ్యమంత్రి గా విశిష్ట సేవలందించిన మనోహర్ పారికర్ మూడేళ్ళ పాటు కేంద్రమంత్రిగా కూడా పనిచేసాడు . అయితే చికిత్స కోసం దేశ విదేశాలకు వెళ్ళొచ్చినప్పటికీ నయం కాకపోవడంతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు .
మనోహర్ పారికర్ మృతి తో గోవాలో విషాద ఛాయలు అలుముకున్నాయి . పారికర్ మృతికి రాష్ట్రపతి , ప్రధాని , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు . ఈరోజు గోవాలో మనోహర్ పారికర్ అంత్యక్రియలు అధికార లాంచలనాలతో జరుగనున్నాయి .
English Title : Goa Chief Minister Manohar Parrikar passed away