మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మొదలుపెట్టిన ఓటిటి సంస్థ ఆహాలో చాలా మలయాళం సినిమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ డబ్బింగ్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం అల్లు అరవింద్ ఒక మలయాళ చిత్ర రీమేక్ పై ఆసక్తి చూపించాడట. ఈ మధ్య మలయాళ చిత్రాలు దాదాపుగా అన్నీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి. విభిన్నమైన కథా, కథనాలతో మలయాళ చిత్రాలు అన్ని భాషల వారిని ఆకర్షిస్తున్నాయి.
అందుకే మలయాళ చిత్రాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే మలయాళం నుండి అయ్యప్పనుమ్ కోశియుమ్, కప్పేలా చిత్రాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి. తాజాగా నయట్టు అనే మలయాళ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కాబోతోంది. ఈ చిత్ర రీమేక్ రైట్స్ ను గీతా ఆర్ట్స్ సంస్థ చేజిక్కించుకుంది. నయట్టు చిత్ర దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపాడు.
విభిన్నమైన కాప్ థ్రిల్లర్ గా నయట్టు ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రీమేక్ కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.