Homeటాప్ స్టోరీస్ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

అశ్రునయనాలతో తుది విడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకార్తలు స్వర్గీయ గౌతమ్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను కడసారి చేసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు.

- Advertisement -

సోమవారం గుండెపోటుతో గౌతమ్‌రెడ్డి(49) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం గుండెపోటు రావడం తో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి కి తరలించారు. హాస్పటల్ కు వెళ్లే లోపు ఆయన మృతి చెందారు.

ఈయన మరణం యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను శోకసంద్రం లో పడేసింది. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసం లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచి..మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన పార్థివ దేహాన్ని నెల్లూరుకు తరలించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All