Homeటాప్ స్టోరీస్మ‌రో క్రేజీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న జీఎ2, యువీ!

మ‌రో క్రేజీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న జీఎ2, యువీ!

మ‌రో క్రేజీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న జీఎ2, యువీ!
మ‌రో క్రేజీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న జీఎ2, యువీ!

నాని న‌టించిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సినిమాతో గీతా ఆర్ట్స్‌2, యువీ క్రియేష‌న్స్ కొల‌బ‌రేష‌న్‌లో చిన్ని సినిమాల్ని నిర్మించ‌డం మొద‌లుపెట్టారు. ఆ త‌రువాత వ‌చ్చిన `టాక్సీవాలా` గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో వ‌చ్చిన `ప్ర‌తిరోజు పండ‌గే` వంటి హిట్ చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించిన ఈ రెండు సంస్థ‌లు తాజాగా మ‌రో క్రేజీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

`అసుర‌న్‌` సూప‌ర్‌హిట్ త‌రువాత కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ త‌మిళంలో `సురులి` పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. డి40 వ‌ర్కిగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. కార్తిక్ సుబ్బ‌రాజ్ రూపొందించిన పిజ్జా, జిగ‌ర్ తాండ‌, పేట్టా చిత్రాలు తెలుగులోనూ మంచి విజ‌యాల్ని సాధించాయి. దీంతో ఈ చిత్రంపై నిర్మాణ ద‌శ‌లోనే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో యువీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థ‌లు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర వ‌ర్గాలు సోమ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించాయి.

- Advertisement -

ఎస్‌. శ‌శికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నీ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ ల‌ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ధ‌నుష్ ఈ సినిమాతో పాటు త‌మిళంలో `క‌ర్ణ‌న్‌` పేరుతో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాస్ క‌థ‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All