ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది . ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పరోక్షంగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు . ఇక ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా చంద్రబాబు కు బాగా నమ్మిన బంటులు కావడం విశేషం .
నలుగురు రాజ్యసభ సభ్యులలో సుజనా చౌదరి , సీఎం రమేష్ , టీజీ వేంకటేశ , గరికపాటి మోహన్ రావు లు ఉన్నారు . రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి మొత్తం ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉండగా అందులో నలుగురు కాషాయం కు మద్దతు తెలిపారు . ఇక మరో ఇద్దరిని కూడా బీజేపీ లోకి తెచ్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు . ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోయింది , ఇక ఆంధ్రప్రదేశ్ లో అలాగే ఉంది పార్టీ పరిస్థితి . అసెంబ్లీ లో 23 మంది ఎం ఎల్ ఏ లున్నారు తెలుగుదేశం కు అయితే 5 ఏళ్ల పాటు వాళ్ళని కాపాడుకోవడం కష్టంగానే కనబడుతోంది . ఇందులో 15 మందికి పైగా అటు బీజేపీ తోనూ ఇటు జగన్ పార్టీ తోనూ టచ్ లో ఉన్నారట ఎం ఎల్ ఏ లు .