స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో ‘ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. తొలిసారి ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకున్న బన్నీ ఈ జోష్ లోనే పాన్ ఇండియా చిత్రాన్ని మొదలు పెట్టారు.
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న చిత్రం ‘పుష్ప‘. శేషాచలం అడవుల నేపథ్యంలో గంధపు చక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ లారీ డ్రయివర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈచిత్ర తాజా షెడ్యూల్ ni మార్చిలో మొదలు పెట్టాలనుకున్నారు. కరోనా దెబ్బతో వాయిదా వేశారు.
మారేడుమిల్లి లో కీలక షెడ్యూల్ జరపాలని ప్లాన్ చేశారు. తాజా పరిస్థుతుల నేపథ్యంలో అక్కడ షూటింగ్ కి హీరో ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపించకపోవడంతో ఫారెస్ట్ సెట్ ని అన్న పూర్ణ సెవెన్ ఎకర్స్ లో రీ క్రియేట్ చేస్తున్నారట. ఇప్పటికే సెట్ వర్క్ ని మొదలు పెట్టారట. వన్స్ వర్క్ కంప్లీట్ అయితే హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక షూటింగ్ కి రానున్నారట.
- Advertisement -