కరోనా వైరస్ కారణంగా చాలా జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఎన్నో కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశాలనే గడగడ లాడిస్తోంది. అగ్ర రాజ్యం సైతం దీని దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది.
దీని కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఒకరిని ఒకరు కలిసే అవకాశం లేకుండా పోయింది. సినిమా షూటింగ్ కోసం జోర్దాన్ లో స్ట్రక్కైన మళయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కొన్ని రోజుల విరామం తరువాత తిరిగి ఇండియా చేరుకున్నాడు.
అదే తరహాలో హీరో మంచు విష్ణు వైఫ్ వెరోనికా , పిల్లలు గత 100 రోజులుగా సింగపూర్ లో స్ట్రకయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్డే భారత్ మిషన్’ కారణంగా ఈరోజే తిరిగి ఇంటిదారి పట్టారు. దీంతో 100 రోజులుగా భార్యా పిల్లలకోసం ఎదురు చూస్తున్న హీరో మంచు విష్ణు నిరీక్షణ ఫలించింది.
- Advertisement -