యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్నారంటూ ప్రకటన విడుదల చేశారు. తీరా సినిమా పట్టాలెక్కుతుందనే సమయానికి కరోనా మొదలైంది. ఆ తరువాత స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ల మధ్య స్పర్ధలు తలెత్తడంతో ఆ ప్రాజెక్ట్ కాస్తా కొరటాల శివ చేతికి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్ పరిస్థితేంటి? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇంతలో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ని సూపర్స్టార్ మహేష్తో చేయబోతున్నారని వార్తలు షికారు చేయడం మొదలైంది. అనూహ్యంగా ఈ వార్తల్ని నిజం చేస్తూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ శనివారం సాయంత్రం 4:05 నిమిషాలకు మహేష్ – త్రివిక్రమ్ల ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనని విడుదల చేసింది.
అయితే `మా సూపర్ న్యూస్లో కొంచెం ఆలస్యం ఉంది. కానీ అది విలువైనదిగా ఉంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. మీకు తెలుసా కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది` అంటూ సదరు నిర్మాణ సంస్థ 4:05 నిమిషాలు దాటినా ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్లో అసహనం పెరిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా హారిక అండ్ హాసిని సంస్థపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా బూతులతో సెటైర్లు వేస్తూ అనౌన్స్ మెంట్ నుంచే మాకీ నరకం చూపిస్తున్నారు.. ఖర్మరా బాబు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే టాపిక్ హాట్ హాట్గా మారింది.