వరల్డ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాల్లో ఉంటె..ఏపీలో మాత్రం అభిమానులు పూర్తి నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేస్తుంది కాబట్టి. మొన్నటి వరకు చిత్రసీమ తో ప్రభుత్వం చర్చలు జరిపింది. టికెట్ ధరలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ హామీ తో అంత భీమ్లా నాయక్ రిలీజ్ టైం వరకు అంత సెట్ అవుతుందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాతే టికెట్స్ పెంచేలా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అభిమానులు మాత్రం కనీసం బెనిఫిట్ షోస్ అనుమతి ఇవ్వాలని కోరుతున్నప్పటికీ , ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెపుతుంది. ఇదిలా ఉంటె ‘బెనిఫిట్ షోస్’ కు అనుమతి ఇవ్వాలని చిత్తూరులో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.
మాచర్లలో పవన్ అభిమానులు మరో అడుగు ముందుకేసి ఓ చోట గేటుకు ఓ డబ్బాను కట్టారు. దానిపై ‘భీమ్లా నాయక్’ పోస్టర్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ బొమ్మ పక్కనే “సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా వారికి మాకు చేతనైన సహకారం కొరకు మాచర్ల పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున విరాళాల సేకరణ” అంటూ అందులో పేర్కొన్నారు. ఇలా ‘భీమ్లా నాయక్’ కోసం ఏపీలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అభిమానులు ఇంతగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం మాత్రం మెట్టు దిగకపోవడం పట్ల సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.