Homeటాప్ స్టోరీస్`ఎఫ్‌2` చిత్రానికి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డ్‌!

`ఎఫ్‌2` చిత్రానికి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డ్‌!

`ఎఫ్‌2` చిత్రానికి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డ్‌!
`ఎఫ్‌2` చిత్రానికి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డ్‌!

గ‌త ఏడాది సంక్రాంతి బ‌రిలో నిలిచి ఊహించ‌ని విధంగా భారీ విజ‌యాన్ని సాధించిన చిత్రం `ఎఫ్‌2`. `ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌`. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఫుల్ ఆఫ్ ఫ‌న్ సీన్‌ల‌తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా త‌మ‌న్నా, మెహ్రీన్ క‌నిపించారు. వెంకీ ఆస‌న్ ఇప్ప‌టికీ అల్టిమేట్‌. ఈ చిత్రానికి, ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి అరుదైన పుర‌స్కారం ల‌భించింది. 2019 సంవ‌త్స‌రానికి గాను వివిధ బాష‌ల‌కు చెందిన 26 చిత్రాల‌కు కేంద్ర స‌మాచార శాఖ అవార్డుల్ని ప్ర‌క‌టించింది.

- Advertisement -

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేప‌ట్ట‌గా ఇందులో గ‌త ఏడాది విడుద‌లైన `ఎఫ్‌2`తో పాటు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డుని అందుకోనున్నారు. ఈ ఏడాది ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డుకు ఎంపికైన ఏకైక చిత్రంగా `ఎఫ్‌2` నిలిచింది.  2019 ఇండిమ‌న్ ప‌నోర‌మ అవార్డుల్లో `ఎఫ్‌2`కు రెండు అవార్డులు ద‌క్క‌డం ఆనందంగా వుంది అని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All