హిందీలో రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ సంవత్సరాలుగా ఒక సీజన్ తర్వాత మరొకటి విజయవంతంగా రన్ అవుతోంది. లెజండరీ అమితాబ్ బచ్చన్ ఈ షో ను కొన్ని సీజన్స్ గా రన్ చేస్తున్నాడు. అయితే నార్త్ లో హిట్ అయిన ఈ షో సౌత్ లో మాత్రం అంత సక్సెస్ కాలేదు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ను ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్లాప్ గానే మిగిలింది. ముందుగా నాగార్జున స్టార్ మా కోసం ఈ షో ను హోస్ట్ చేసాడు. రెండు సీజన్స్ హోస్ట్ చేసాడు. ముందుగా రేటింగ్స్ బాగానే వచ్చాయి కానీ తర్వాత పడిపోయాయి.
మూడో సీజన్ కు చిరంజీవి హోస్ట్ అయ్యాడు. అప్పుడు రేటింగ్స్ మరింతగా దిగజారాయి. ఇక స్టార్ మా ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జెమినీ టివి ఈ రియాలిటీ షో ను ప్రారంభించింది. ఎవరు మీలో కోటీశ్వరులుగా పేరు మార్చి ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకొచ్చింది.
ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభ ఎపిసోడ్ కు రేటింగ్స్ అదిరిపోయింది. రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చిన ఆ ఎపిసోడ్ కు 11 పైన టీఆర్పీ వచ్చింది. కానీ ఆ తర్వాత షరా మాములే. నెమ్మదిగా రేటింగ్స్ పడిపోతూ వచ్చాయి. ప్రస్తుతం రేటింగ్స్ 3, 2.69 ఆ రేంజ్ నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ సీజన్ అనుమానమే. ఎన్టీఆర్ కూడా ఈ షో విషయంలో ఏం చేయలేకపోయాడు.