ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవల `రెడ్` థ్రిల్లర్తో ఆకట్టుకున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్తో ఆయన తన నెక్స్ట్ మూవీని చేస్తారంటూ వార్తలు వినిపించాయి. అనూహ్యంగా ఆ స్థానంలోకి యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్. లింగుసామి వచ్చి చేరారు. వీరిద్దరి కలయికలో మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ని కొత్త నిర్మాత శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
పందెంకోడి, ఆవారా వంటి చిత్రంతో మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లింగుసామి గత కొంత కాలంగా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు హీరో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్నీ మూవీ గురువారం సంస్థ కార్యాలయంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వ్యాల్యూస్తో హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ప్రెస్టీజియస్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపింది.