Homeటాప్ స్టోరీస్బ్రేకింగ్ :  క‌రోనా కార‌ణంగా తెలుగు నిర్మాత మృతి!

బ్రేకింగ్ :  క‌రోనా కార‌ణంగా తెలుగు నిర్మాత మృతి!

బ్రేకింగ్ :  క‌రోనా కార‌ణంగా తెలుగు నిర్మాత మృతి!
బ్రేకింగ్ :  క‌రోనా కార‌ణంగా తెలుగు నిర్మాత మృతి!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. చైనాలోని పూహాన్ న‌గ‌రంలో పుట్టిన ఈ వైర‌స్ ప్ర‌పంచాన్నే నాశ‌నం చేస్తోంది. దీని ధాటికి ప్ర‌పంచ దేశాల‌న్నీ కుదేలైపోతున్నాయి. ప్ర‌తీ రంగం ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినీ రంగం భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది. ఇప్ప‌టికే దీని బారిన ప‌డిన హిందీ న‌టులు, నిర్మాత‌లు చాలా మంది మృత్యువాత ప‌డ్డారు. తాజాగా టాలీవుడ్‌లో క‌రోనా కార‌ణంగా ఓ నిర్మాత చ‌నిపోవ‌డం క‌ల‌క‌లంగా మారింది.

హైద‌రాబాద్‌లో క‌రోనాస్వైర విహారం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీని బారిన ప‌డిన పోకూరి రామారావు శుక్ర‌వారం రాత్రి క‌న్నుమూశారు. పోకూరి రామారావు ఈత‌రం ఫిల్మ్స్ అధినేత పోకూరి బాబూరావుకు సోద‌రుడు. సోద‌రుడు బాబూరావుతో క‌లిసి రామారావు ఎన్నో చిత్రాల‌ని అందించారు. ఈత‌రం ఫిల్మ్స్‌కి ఆయ‌న స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌‌న మృతి ప‌ట్ల తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All