హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ అభిమానులు దాడి చేస్తున్నారు . కొంతమంది అయితే శృతి మించి మరీ బూతులు కూడా తిట్టేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ ని . ఇంతకీ దుల్కర్ అభిమానులు రకుల్ ప్రీత్ సింగ్ పై ఎందుకు దాడి చేస్తున్నారో తెలుసా …… రకుల్ చేసిన తప్పేంటో తెలుసా ……. మహానటి చిత్రం చూడటమే ! మహానటి చిత్రం చూసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ , సమంత , విజయ్ దేవరకొండ లను ప్రశంసించడమే !
మహానటి చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు సమంత , విజయ్ దేవరకొండ లు మాత్రమే కాదు జెమిని గణేశన్ పాత్రలో డుల్కర్ సల్మాన్ నటించాడు . అతడు మలయాళంలో రైజింగ్ లో ఉన్న హీరో పైగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు కూడా దాంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . కీర్తి సురేష్ , సమంత , విజయ్ దేవరకొండ లను పొగిడి మా హీరో దుల్కర్ ని ఎలా మర్చిపోతారు అంటే ….. మా హీరోని అవమానించడమే అంటూ రకుల్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . రకుల్ పొరపాటున డుల్కర్ ని మర్చిపోయి ఉంటుంది దాంతో అతడి అభిమానుల నుండి తిట్లు తింటోంది పాపం .