Homeటాప్ స్టోరీస్దృశ్యం 2 ఆలోచన మారిందా?

దృశ్యం 2 ఆలోచన మారిందా?

దృశ్యం 2 ఆలోచన మారిందా?
దృశ్యం 2 ఆలోచన మారిందా?

విక్టరీ వెంకటేష్ చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ ను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేసాడు. వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 2 విడుదలైంది. దానికి అదిరిపోయే రేటింగులు వచ్చాయి. వెంటనే మన వెంకీ మామ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయాడు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే దృశ్యం 2 చిత్రీకరణ మొత్తం పూర్తి చేసేసాడు.

నారప్ప, ఎఫ్ 3 మధ్యలో సమయం చూసుకుని దృశ్యం 2 చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈలోగా పరిస్థితిలో మార్పు వచ్చింది. కరోనా స్థాయి పెరిగిపోయి థియేటర్లు మూతబడ్డాయి. దృశ్యం 2 చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు ఆ వార్తలను ఖండించారు.

- Advertisement -

ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే ఆగస్ట్ వరకూ థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. అందులోనూ విడుదల కావాల్సిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. దీని బట్టి చూసుకుంటే దృశ్యం 2 ఓటిటి రూటు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All