బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై శనివారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహిచారు. సమాయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు దాడులు చేయగా..పబ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -
వారిలో సినీ , రాజకీయ నేతల కుమారులు , కూతుర్లు పట్టుపడ్డారు. వారిలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా ఉంది. అలాగే టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు. వారిని విచారించిన పోలీస్ అధికారులు వారికీ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పబ్ నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి దొరికిన వారందరి విచారించి పంపించారు.
- Advertisement -