
యాంగ్రీ స్టార్ డా. రాజశేఖర్ హీరోగా పెగాసస్ సినీ కార్ప్ ఎల్ ఎల్ పీ, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఓ విభిన్నమైన చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ మూవీకి `కేరాఫ్ కంచర పాలెం`, `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రాలతో ప్రశంసలు సొంతం చేసుకున్న వెంకటేష్ మహా దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రాన్ని విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మించబోతున్నారు.
దర్శకుడు వెంకటేష్ మహా పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ ప్రాజెక్ట్ని ప్రకటించడంతో పాటు ఈ చిత్రానికి `మర్మాణువు` అనే టైటిల్న ఖరారు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ. కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా వున్నాయి.
సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం` అని శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి వెల్లడించారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వెంకటేష్ మహా.
Very happy to collaborate with @mahaisnotanoun for #Marmaanuvu .
Happy Birthday Maha! ???????????? pic.twitter.com/dAOCxYDRhi— Dr.Rajasekhar (@ActorRajasekhar) March 25, 2021