సీనియర్ హీరోగా డా. రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. ఆయన నటించిన `అంకుశం`, మగాడు వంటి చిత్రాలు ఇప్పటికే ఎవర్గ్రీన్ మవీస్గా నిలిచిపోయాయి. పోలీస్ స్టోరీస్ అంటే రాజశేఖర్ అనేంతగా పేరు తెచ్చుకున్నారాయన. అయితే గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేని ఆయన మళ్లీ పోలీస్ క్యారెక్టర్తో సక్సెస్ బాట పట్టారు. ఆయన నటించిన `పీఎస్వీ గరుడవేగ` రాజశేఖర్ కెరీర్కు మళ్లీ నూతన జవసత్వాలని అందించింది.
ఈ సినిమా తరువాత కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం `కల్కీ` కూడా ఫరవాలేదనిపించింది. బక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టలేకపోయినా హీ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తి కావస్తున్నా రాజశేఖర్ మరో చిత్రాన్ని ఇంత వరకు ప్రకటించలేదు. తాజాగా ఆయన మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
`షో` చిత్రంతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఓ పవర్ఫుల్ పాయింట్తో దర్శకుడు నీలకంఠ ఇటీవలే హీరో డా. రాజశేఖర్కు కథ వినిపించారని. స్టోరీ ఎక్స్లెంట్గా వుండటంతో ఓకే చెప్పిన రాజశేఖర్ ఈ చిత్రాన్ని స్వయంగా తానే నిర్మిస్తానని ముందుకొచ్చారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిసింది. నీలకంఠ ఇటీవల తమన్నాతో మనస్పర్థలు తలెత్తడంతో `దటీజ్ మహాలక్ష్మి` చిత్రం నుంచి మధ్యలో తప్పుకున్న విషయం తెలిసిందే.