Homeగాసిప్స్డబల్ రోల్స్ హవా తెలుగులో ఊపందుకుంది!

డబల్ రోల్స్ హవా తెలుగులో ఊపందుకుంది!

డబల్ రోల్స్ హవా తెలుగులో ఊపందుకుంది!
డబల్ రోల్స్ హవా తెలుగులో ఊపందుకుంది!

ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ టాలీవుడ్ లో నడుస్తుంటుంది. ఒకసారి బయోపిక్ లు వస్తే, ఒకసారి హారర్ కామెడీలు వస్తాయ్, ఒకసారి విలన్ ను హీరో బకరా చేసే సినిమాలు వస్తాయి, ఒకసారి టైటిల్ లో నువ్వు అన్న పదంతో సినిమాలు ఊపందుకుంటాయి. ఇలా టాలీవుడ్ లో ఒకరు ఏది మొదలుపెడితే అది నడుస్తుండడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా డబల్ రోల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ ఇదివరకు కూడా నడిచినా ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఒకసారి ఏ ఏ సినిమాలు డబల్ రోల్స్ తో ట్రెండ్ అవుతున్నాయో చూద్దాం.

ముందుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటే.. ఈ మధ్యే ఖైదీ నెం 150తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో డబల్ రోల్ లో నటించిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుండగా ఇందులో కూడా చిరు డబల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. చిరు డబల్ రోల్ వేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.

- Advertisement -

సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రంలో కూడా రెబెల్ స్టార్ డబల్ రోల్ లో నటిస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీకొడుకుల పాత్రలు వేస్తున్నాడని తెలుస్తోంది. బాహుబలిలో కూడా ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటించిన విషయం తెల్సిందే. అయితే అందులో ఇద్దరు ప్రభాస్ లు ఒకేసారి కనిపించరు. ఇందులో ఇద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నాయిట.

నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకూ డబల్ రోల్ లో ఎన్ని సినిమాలు చేసాడంటే లెక్కపెట్టలేని పరిస్థితి. అన్ని సినిమాల్లో బాలయ్య డబల్ రోల్ లో నటించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రూలర్ లో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. పోలీస్ ఆఫీసర్ గా, స్టైలిష్ డాన్ గా బాలయ్య కుమ్మేస్తాడని తెలుస్తోంది.

ఇవే కాకుండా మాస్ మహారాజా రవితేజ డిస్కో రాజా తర్వాత చేయాల్సిన సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమార్కుడులో రవితేజ డబల్ రోల్ లో ఇరగతీసిన సంగతి తెల్సిందే. త్వరలోనే ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఇప్పుడు డ్యూయల్ రోల్ ట్రెండ్ లో పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ హిట్ తో తన మార్కెట్ ను సుస్థిరపరుచుకున్న రామ్ ఇప్పుడు తన తర్వాతి చిత్రంగా ఒక రీమేక్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తడం చిత్రాన్ని తెలుగులో రెడ్ గా తీయబోతున్నాడు. అయితే తమిళ చిత్రానికి తెలుగు వెర్షన్ కు చాలా మార్పులుంటాయని తెలుస్తోంది. కానీ డ్యూయల్ రోల్ లో ఎటువంటి మార్పులు ఉండవు. రెడ్ చిత్రంలో రామ్ బ్రదర్స్ గా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. నవంబర్ 16 నుండి రెడ్ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఏప్రిల్ 9న రెడ్ విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All