Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్హృదయాలను ఏలే ‘దొరసాని’

హృదయాలను ఏలే ‘దొరసాని’

- Advertisement -

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు
పట్టం కడుతున్నారు. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే
దొరసాని’.
టైటిల్ కు తగ్గట్టుగానే ఇది తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకం లో జరిగిన
కథగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర
యూనిట్. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ పరిశ్రమ వర్గాల్లోనూ మంచి
ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది.
కథ లోంచి పరిచయం అయిన రాజు, దొరసాని చూడ ముచ్చటగా ఉన్నారు.
కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన హీరో ఆరాధనగా
చూస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఒక రకంగా కథలోని ఆత్మను చెబుతోంది.  రాజు
కళ్ళల్లో ప్రేమ, దొరసాని కళ్ళల్లో దర్పం ఈ ప్రేమ కథ లో వైరుధ్యాన్ని
చూపిస్తున్నాయి.
హీరో, హీరోయిన్ల డ్రెస్సింగ్ తో పాటు ఆమె ఉన్న కార్ ను బట్టి కథకు
తగ్గట్టుగా నాటి కాలపు వాతావరణాన్ని ఈ చిత్రంలో రీ క్రియేట్ చేసింది
చిత్ర యూనిట్.
ప్రస్తుతం వస్తోన్న రియలిస్టిక్ మూవీస్ లో ఈ చిత్రం ఓ కొత్త తరహాగా
నిలువబోతోందని ఈ లుక్ చెప్పకనే చెబుతోంది.
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరో, హీరోయిన్లు గా పరిచయం చేస్తూ సురేష్
ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ సంస్థ సంయుక్తంగా
నిర్మించిన ఈ చిత్రం తో  కెవిఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
అలాగే ఈ చిత్ర టీజర్ జూన్ 6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు
నిర్మాతలు

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : నవీన్
నూలి, సినిమాటోగ్రఫీ : సన్ని కూరపాటి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి,
పిఆర్.వో : జిఎస్.కె మీడియా, నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్
రంగినేని, రచన, దర్శకత్వం : కెవిఆర్ మహేంద్ర.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts