మాస్ రాజా రవితేజ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కష్టాల్ని ఎదుర్కుంటోంది. సంక్రాంతి కానుకగా పండక్కి ఐదు రోజుల ముందే థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో గందర గోళం ఏర్పడింది.
`క్రాక్` ఎర్లీమార్నింగ్ షోస్ ఉదయం 8:45 పడాల్సిన షో పడలేదు. దీంతో సినిమా రిలీజ్ పై గందరగోళం నెలకొంది. ఈ చిత్ర నిర్మాత మధు గతంలో వరుస ఫ్లాపుల్ని అందించారు. ఆయన నిర్మించిన `స్పైడర్`, ఆ తరువాత చేసిన `దర్బార్` బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన పంపిణీదారులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాలని నిర్మాత మధు ఇంత వరకు రికవరీ చేయలేదు.
దీంతో సమయం కోసం ఎదురుచూసిన డిస్ట్రీబ్యూటర్స్ `క్రాక్`పై పడినట్టు తెలుస్తోంది. తమ నష్టాలని క్లియర్ చేసిన తరువాతే `క్రాక్` రిలీజ్ అంటూ పంపిణీదారులు భీష్మంచడం వల్లే `క్రాక్` రిలీజ్ ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. నిర్మాత మధు పంపిణీదారులకు నష్టపరిహారాన్ని చెల్లించడంతో `క్రాక్` మూవీ ఆలస్యంగా థియేటర్లలో మొదలైనట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.