బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. దీంతో ఆయనతో సినిమాలు నిర్మించడానికి ఇతర భాషలకు చెందిన దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ నటించే చిత్రాలు వుండటంతో బాలీవుడ్ హీరోయిన్ లు కూడా ప్రభాస్తో నటించేందుకు పోటీపడుతున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ `సలార్` చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రభాస్ కొత్త తరహా పాత్రలో రగ్గ్డ్ లుక్లో నటించనున్న ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిషా పటాని నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారని, దిషా పటాని మేకర్స్ ఇచ్చిన ఆఫర్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన అత్యధిక భాగం హైదరాబాద్, బెంగళూరులలో చిత్రీకరించనున్నారట. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ రెండు నగరాల్లో కీలక ఘట్టాలని చిత్రీకరించనున్నారట. ప్లాన్ ప్రకారం నాలుగు నెలల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ `రాథేశ్యామ్` చిత్రంలో నటిస్తున్నారు.