స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ , ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.
ఇటీవలే రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. టీమ్లో కొంత మందికి కరోనా సోకగంతో చిత్ర బృందం షూటింగ్ని అర్థాంరంగా ఆపేసి తిరిగి హైదరాబాద్ చేసుకున్నారు. ఇటీవల మళ్ల కాచీగూడాలో నైట్ ఎఫెక్ట్లో యాక్షన్ ఘట్టాలని రాత్రింబవళ్లు చిత్రీకరించారు. ఇదిలా వుంటే ఈ మూవీ కోఎసం అదిరిపోయే ఐటమ్ నెంబర్ని ప్లాన్ చేశారట. సుకుమార్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్కి పెద్ద పీట వేస్తుంటారు. ఆర్యలో ఆ అంటే అమలా పురం.. ఆర్య 2లో రింగా రింగా.. రంగస్థలంలో జిగేల్ రాణి పాట ఓ రేంజ్లో ఊపేశాయి.
ఇదే తరహాలో `పుష్ప` కోసం ఓ మాస్ మసాలా సాంగ్ని ప్లాన్ చేశారట. ఈ పాట కోసం చాలా మంది క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా చిత్ర బృందం బాలీవుడ్ హాట్ ఆటమ్ బాంబ్ దిశ పటానిని సంప్రదించారట. అయితే దిశ మాత్రం కోటిన్నర డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో `పుష్ప` టీమ్ షాకయ్యారట.